Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి  సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

జోగిపేటః సంగారెడ్డి జిల్లా తాడ్దాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద జోగిపేటకు చెందిన వ్యాపారస్తుడు కటుకం ప్రవీణ్‌ కుమారుడు కటుకం వినయ్‌ కుమార్‌పై టోల్‌గేట్‌ సిబ్బంది రాడ్‌తో దాడి చేయడంతో వినయ్‌ తలపగిలి పోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం జోగిపేట వైపు నుంచి సంగారెడ్డికి వినయ్‌ తన స్నేహితులతో కలిసి టీఆర్‌ నంబరు గల కొత్త కారులో వెళుతూ టోల్‌టాక్స్‌ వద్ద లోకల్‌ అని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మద్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో చాలా సేపటి వరకు ఉద్రిక్తత ఏర్పడింది. టోల్‌ ప్లాజా సిబ్బంది అక్కడే ఉన్న ఇనుప రాడ్‌తో వినయ్‌ తలపై బలంగా కొట్టడంతో రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడికి చేరుకున్న వినయ్‌ స్నేహితులు దాడి చేసిన వ్యక్తి కోసం ఆ ప్రాంతమంతా గాలించారు. దాడి చేసిన వ్యక్తి తమకు కావాలని పట్టుబట్టారు. సుమారు అరగంట సేపు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జోగిపేట సీఐ అనీల్‌కుమార్, ఎస్‌ఐలు క్రాంతి, పాండులు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలం వద్దకు చేరుకొని అందరిని చెదరగొట్టారు. టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జోగిపేట సీఐ అనీల్‌కుమార్‌ తెలిపారు.

Related posts

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

TNR NEWS

మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

ముండ్ర వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు

TNR NEWS

బీసీ ఆజాది ఫెడరేషన్ జూలపల్లి మండల అధ్యక్షునిగా వోడ్నాల తిరుపతి నియామకం..

TNR NEWS

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS