Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్యతో, పాటు మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి యాసంగి సీజన్ లో ముందుగా వరి నాట్లు వేసిన పొలాల్లో, ఇలా కొన్ని కంపనీ లకు చెందిన సన్న గింజ రకాలకు ముందుగానే కంకులు రావడం జరుగుతుందని తెలిపారు.ఈ విధంగా 45 రోజులకే కంకులు రావడం గల కారణాలను కనుగొనడానికి,ఇది విత్తన నాణ్యత లేకపోవడం వలన జరిగిందా? లేక
వాతావరణ పరిస్థితుల వలన జరిగిందా?
అనేది పూర్తి అంచనా కోసం శాస్త్రవేత్తలను రప్పిస్తామని వారు ఆ పంట పొలాలను పరిశీలన చేసిన తర్వాత, వారిచ్చే తుది నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, రైతులు కోలా ఉపేందర్, శివకృష్ణ, మహేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Harish Hs

లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు

Harish Hs

లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

Harish Hs

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS