Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్యతో, పాటు మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి యాసంగి సీజన్ లో ముందుగా వరి నాట్లు వేసిన పొలాల్లో, ఇలా కొన్ని కంపనీ లకు చెందిన సన్న గింజ రకాలకు ముందుగానే కంకులు రావడం జరుగుతుందని తెలిపారు.ఈ విధంగా 45 రోజులకే కంకులు రావడం గల కారణాలను కనుగొనడానికి,ఇది విత్తన నాణ్యత లేకపోవడం వలన జరిగిందా? లేక
వాతావరణ పరిస్థితుల వలన జరిగిందా?
అనేది పూర్తి అంచనా కోసం శాస్త్రవేత్తలను రప్పిస్తామని వారు ఆ పంట పొలాలను పరిశీలన చేసిన తర్వాత, వారిచ్చే తుది నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, రైతులు కోలా ఉపేందర్, శివకృష్ణ, మహేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS

*ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలి : DSP జి.రవి.*  *సూర్యాపేట కొత్తబస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ట్రాఫిక్ నియంత్రణను ఆకస్మికంగా తనిఖీచేసిన DSP రవి.*

TNR NEWS

ఘనంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TNR NEWS

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS