May 7, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్యతో, పాటు మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి యాసంగి సీజన్ లో ముందుగా వరి నాట్లు వేసిన పొలాల్లో, ఇలా కొన్ని కంపనీ లకు చెందిన సన్న గింజ రకాలకు ముందుగానే కంకులు రావడం జరుగుతుందని తెలిపారు.ఈ విధంగా 45 రోజులకే కంకులు రావడం గల కారణాలను కనుగొనడానికి,ఇది విత్తన నాణ్యత లేకపోవడం వలన జరిగిందా? లేక
వాతావరణ పరిస్థితుల వలన జరిగిందా?
అనేది పూర్తి అంచనా కోసం శాస్త్రవేత్తలను రప్పిస్తామని వారు ఆ పంట పొలాలను పరిశీలన చేసిన తర్వాత, వారిచ్చే తుది నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, రైతులు కోలా ఉపేందర్, శివకృష్ణ, మహేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో మ్యాథ్స్ ఎక్స్ పో..

TNR NEWS

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs

హైదరాబాద్ అడ్డాగా భారీగా డ్రగ్స్ రాకెట్!

Dr Suneelkumar Yandra

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేంద్రీయ రంగులతో హోలీ సంబరాలు. 

TNR NEWS