హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఈసారి భారీ డిమాండ్ నెలకొంది. పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే ఇప్పటికే 92 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి అధిక స్పందన లభిస్తోంది. తక్కువ ఫీజులతో నాణ్యమైన సాంకేతిక విద్య అందుతుండటంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో విడుదల చేయనున్నారు.
