Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించి వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ చానల్ ద్వారా వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మునగాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు సమ్మె నోటీసును అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని తెలియజేస్తూ సమ్మె నోటీస్ ను ఇవ్వడం జరిగిందని.గ్రామ పంచాయితీలలో 40 సంవత్సరాల నుండి పంచాయితీలనే నమ్ముకుని సేవలు చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని,ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని,అట్లాగే కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి నుండి ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు చెల్లిస్తారని ప్రకటించడం జరిగింది వెంటనే కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి వాసిమేకల వెంకటేశ్వర్లు, యూనియన్ మండల అధ్యక్షులు ఎల్ నాగార్జున, కార్యదర్శి మామిడి వెంకటేశ్వర్లు, నాయకులు ధారా రవికుమార్,శంకర్ , షేక్ సైద్ జానీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపాధి హామీ పనులు 20 రోజులు పూర్తి చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలి.          సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS

అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులకు రెండు బహుమతులు అందజేత

TNR NEWS

అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలి అందరూ కలిసిమెలిసి జీవించడం సూర్యాపేట సంస్కృతి సూర్యాపేట పోరాటాల పురిటిగడ్డ ఇక్కడ వ్యాపారులు ఉద్యమాలలో పాల్గొని తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS