Tnrnews.in
తెలంగాణ

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

వేసవికాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైటెక్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు ట్రస్టు సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య అవసరాల కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి ప్రజలు, బాటసారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నేటి నుండి వేసవి కాలం పూర్తయ్యేంతవరకు తాగునీరు పంపిణీ చేయడం శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, కిట్స్ మహిళా కళాశాల చైర్మన్ నీల సత్యనారాయణ, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చారుగండ్ల రాజశేఖర్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షులు యధా సుధాకర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వేంపాటి వెంకటేశ్వరరావు, యాదా శ్రీనివాస్, పందిరి సత్యనారాయణ, ప్రకాష్ రావు, ఓరుగంటి ప్రభాకర్, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు…………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

టి పి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

TNR NEWS

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS

మహిళలు వ్యాపారస్తులుగా మారాలి

TNR NEWS

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS

తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS