Tnrnews.in
తెలంగాణ

ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయి

నడిగూడెం పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న కానిస్టేబుల్ వి.ఉపేందర్, పాలకివీడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, మునగాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జి.శ్రీకాంత్ లు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పి ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నర్సింహా ప్రమోషన్ పొందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ లకు ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగోన్నతి తో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలు కు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సమన్వయంతో ముందుకెళ్లాలని కోరినారు. ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఎస్పీ వెంట అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డియస్పి నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉమ్మడి రవి

TNR NEWS

దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS

పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డు.. ఎలా దరఖాస్తు చేయాలంటే…?

TNR NEWS

ఎస్ ఆర్ ఎస్పి స్టేజ్ 2 కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ప్రకటించిన సి ఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS