కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో కుటుంబ సర్వే 80 శాతం పూర్తయిందని మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 14,060 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 11,351 కుటుంబాలకు సర్వే జరిగిందని చెప్పారు. మరో రెండు రోజుల్లో 100% పూర్తయ్యే విధంగా చూస్తామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండలంలోని గ్రామాలలో సర్వే పనులను వేగవంతం చేసి ప్రభుత్వ నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని, గ్రామాలలో సర్వే చేస్తున్న అధికారులకు ఎంపీడీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తో పాటు స్థానిక పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
