తెలంగాణ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మెగా జీవిత బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఏ కారణం చేత చనిపోయినా లబ్ధిదారుని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా అమల్లోకి రానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా దాదాపు కోటి మందికి, రైతు బీమా ద్వారా 37 లక్షల మందికి జీవిత బీమా రక్షణ లభించనుంది. ఈ రెండు పథకాల అమలుకు ఏడాదికి సుమారు రూ.5,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. వచ్చే ఆగస్టు 15 లోపు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
