హైదరాబాద్, జూలై 19 : ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రచారం మీడియా, ఎంఎన్ సెలబ్రిటీస్ అండ్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026” పోస్టర్ను రాష్ట్ర నీటిపారుదల, ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరియు ఓటీటీ రంగంలోని ప్రతిభావంతులను సత్కరించే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రచారం మీడియా వ్యవస్థాపకుడు & సీఈఓ ఎండీ నాయుడు మాట్లాడుతూ ఆగస్టు 30, 2026న హైదరాబాద్లో జరగనున్న తెలుగు ఐకాన్ అవార్డ్స్ 2026ను తెలుగు సినిమా మరియు ఓటీటీ రంగానికి ప్రతిష్టాత్మక అవార్డు వేదికగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
