ఎక్సైజ్ శాఖలో భారీ కుదుపునకు యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతున్నదా? ఆ శాఖలో 2012 తరహా దాడులకు ఏసీబీ వ్యూహ రచన చేస్తున్నదా? సబ్ ఆర్డినేట్లే ‘కలెక్షన్ ఏజెంట్లు’గా నెలవారీ మామూళ్లు, అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఉన్నతస్థాయి అధికారులకు సర్దుబాటు చేస్తున్నట్టు నిజామాబాద్ రైడింగ్లో తేలిందా? ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. ఏసీబీ దాడులకు దిగనున్నదా? అంటే రాష్ట్రంలో ఏసీబీ దూకుడు చూస్తుంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
ఇటీవల నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపుదాడుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడులు కేవలం ఒక అధికారి అక్రమాస్తుల గుర్తింపుతో ముగిసిపోలేదని, దీని వెనుక ఉన్న భారీ లంచాల నెట్వర్ను ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. అందుకోసం ఏసీబీ ఒక ప్రొఫార్మా తయారు చేసి, దాని ఆధారంగా వివరాలు కావాలని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖకు లేఖ పంపించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
