Tnrnews.in
తెలంగాణ

అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు

ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ పద్మనాభ రెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. సోమవారం ఆయన 12వ వర్ధంతి సందర్భంగా కోదాడ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం హైకోర్టులో నిరంతరం న్యాయపోరాటం సాగించి బాధితులకు అండగా నిలిచిన మహనీయుడు పద్మనాభ రెడ్డి అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తన గళాన్ని వినిపించి బాధితులకు అండగా నిలిచేవారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గట్ల నరసింహారావు, కోదాడ అధ్యక్షులు అబ్దుల్ రహీం, కార్యదర్శి వెంకటాచలం, సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి, శరత్ బాబు, యశ్వంత్, సిలివేరు వెంకటేశ్వర్లు, ఉయ్యాల నరసయ్య, హేమలత, మురళి, శ్రీధర్,వెంకన్న, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు……

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు……….  కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు…..  ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……

TNR NEWS

ప్రజలందరి దేవుడు అంబేద్కర్

TNR NEWS

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

జానకి రామ్ ను సన్మానించిన కోదాడ రచయితల సంఘం

Harish Hs