ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరటనిచ్చే వార్తను వాతావరణ నిపుణులు వెల్లడించారు. బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు 7,000-10,000 పొడవుతో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) విస్తరించిందని తెలిపారు. దీనివల్ల వెచ్చని, తేమతో కూడిన గాలులు పైకి ఎగసి భారీ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 20-30 మధ్య దేశంలో వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
