Tnrnews.in
తెలంగాణ

మునగాల మండల పరిధిలోని మొద్దులచెరువు స్టేజి నుండి మోతె మండలం వరకు ఉన్న ప్రధాన రహదారిపై, రేపాల గ్రామం వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిపోతోందని.. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేపాల ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

​బుధవారం రేపాల గ్రామంలో నిర్వహించిన అధికారిక పర్యటన (SIR) కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన గౌరవ కోదాడ ఆర్డీఓ (RDO) గ

ఆయన కలిసి, రహదారి సమస్యపై ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు.

​అధికారులు స్పందించడం లేదు,​ఈ సందర్భంగా తుమ్మ సతీష్ మాట్లాడుతూ.. రేపాల గ్రామ ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయే సమస్యపై గతంలో ఎన్నోసార్లు నిరసనలు తెలిపామని, పత్రికల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎవరూ స్పందించకపోవడం విచారకరమన్నారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ రహదారిపై నీరు నిలవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్డీఓ గారిని కోరారు.

​సానుకూలంగా స్పందించిన కోదాడ ఆర్డీఓ:

 

​సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న కోదాడ ఆర్డీఓ దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ నీటి నిల్వ సమస్యను వెంటనే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, యుద్ధప్రతిపాదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఉపసర్పంచ్‌కు మరియు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బిసీలకు 42% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి  రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయం జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

TNR NEWS

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

TNR NEWS

రహదారుల అనుసంధానమే గ్రామాల అభివృద్ధి :సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య 

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిబాబా ఆలయం

Harish Hs