అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాలతో సూర్యాపేట ఓ ప్రైవేటు కళాశాలలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ వెంకటయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. మత్తుపదార్థాల రవాణా సమాచారం కోసం 1908, డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ సదస్సులో ‘యాంటీ డ్రగ్స్ సోల్జర్’ సెల్ఫీ స్టిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
