మహారాష్ట్ర, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుండగా.. తెలంగాణలో మాత్రం వాన చినుకు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో గాలులు తప్ప వర్షం పడడం లేదు. దీంతో పొలాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మరో వారం పది రోజులు పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని, ఉష్ణోగ్రతలు పెరిగి ‘డ్రై సీజన్’ ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
