Tnrnews.in
తెలంగాణ

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సహకారం అందించి అండగా ఉంటున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. బుధవారం బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం వద్ద నిరుపేద కుటుంబాలకు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు, ప్రతిభ కలిగి చదువు దూరమైన విద్యార్థులకు 1,10,000 ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేసి మాట్లాడారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కులాలకు,మతాలకు అతీతంగా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా ఎంతోమందికి తమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా సహకారం అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు, సురేష్, డాక్టర్ జాస్తి సుబ్బారావు, ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, ఫారమౌంటు అధినేత వెనిగళ్ళ సురేష్, గంట సత్యనారాయణ కాకర్ల వెంకటేశ్వరరావు, బొల్లు రాంబాబు, భ్రమరాంబ,అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

న్యాయవాది మృతి కి సంతాపం

Harish Hs

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నవంబర్7,8 తేదీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగే సర్వేలను* *జయప్రదం చేయండి.*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు* 

TNR NEWS

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS