Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

పిఠాపురం : పట్టణంలోని ఆర్యవైశ్యులు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్యులు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు గల మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆలయం వేదికగా జెండా వందనం కార్యక్రమాలు నిర్వహించి జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ కార్యక్రమానికి వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవాలయం అధ్యక్షులు దంగేటి సత్యనారాయణ మూర్తి, ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగా వెంకటనగేష్, ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా జోన్ చైర్పర్సన్ ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్, కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ కన్వీనర్ బోడ సతీష్, పిఠాపురం మండల్ ఆర్య వైశ్య అధ్యక్షుడు రేపాక రమేష్, చక్క శోభనాద్రి, కప్పల సత్యనారాయణ, బాదం రామయ్య, కర్ణాటక తాతాజీ, మానేపల్లి చైతన్య, కంచర్ల నగేష్, పైండా రాజా, కొత్త దేవ జగన్మోహన్ గుప్తా, కడించర్ల శంకర్ మరియు పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం ఇతర సభ్యులు యావన్మంది ఆర్యవైశ్యులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

 

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కార్పొరేట్ కు దీటుగా మంగళగిరిలో 100 పడకల హాస్పటల్ నిర్మాణం

Dr Suneelkumar Yandra

విద్యుత్ టారిఫ్ బాదుడు వలన ధరలు మరింత పెరుగుతాయి

Dr Suneelkumar Yandra

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కె.నాగబాబు

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఏఎస్‌ఆర్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కళాశాల

Dr Suneelkumar Yandra

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్