👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మండల ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటాం
పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేష్
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఎస్సై వెంకటేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియజేసారు
అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల లో వాగులు వంకల వద్ద భారీ వర్షం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందు వల్ల గ్రామస్తులు,యువకులు అటువైపు వెళ్ళకుండా జాగ్రత్త వహించాలని అయన కోరారు.
ముఖ్యంగా శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవ్వరు ఉండరాదని తెలియజేశారు.
ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు, లేదా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే సంఘటన స్థలానికి వచ్చి సహాయాన్ని అందిస్తామని ఎస్సై వెంకటేష్ తెలిపారు
ప్రజలు అందురు పోలీసులకి సహకరించాలని కోరారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
