Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

బానోత్ బిక్షం నాయక్ మరణం సమాజానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం మోతే మండలం బిఖ్యా తండా గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బానోత్ బిక్షం నాయక్ (90) మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం లో ఈ ప్రాంతం నిర్వహించిన పాత్ర మరువలేదని అన్నారు. నాటి పోరాటం నుండి నేటి వరకు జరిగిన అనేక పోరాటాలలో బానోతు బిక్షం నాయక్ పాల్గొన్నారని అన్నారు. బానోతు బిక్షం నాయక్ కుటుంబం మొదటినుండి సిపిఎం పార్టీ కి అండదండలు ఇస్తూ ఈ ప్రాంతంలో ఎర్రజెండాను నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర బానోతు బిక్షం నాయక్ పోషించారని అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, బానోతు లచ్చరాం నాయక్, దోసపాటి శ్రీనివాస్, డివైఎఫ్ఐ మోతే మండల అధ్యక్షులు వెలుగు మధు చేగువేరా, బిక్క తండా సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి భానోత్ వెంకన్న, నాయకులు బానోత్ శంకర్, బానోతు రమేష్ నాయక్, సైదా, వెంకన్న, కిషన్, రమేష్, చంద్రు నాయక్, గోలియా తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

TNR NEWS

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

TNR NEWS

ప్రజావాణికి 93 దరఖాస్తులు…  ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు… జిల్లా కలేక్టర్ తేజస్  సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి….

TNR NEWS

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS