Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్ లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని గుడు గుండ్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరావు సంతాప సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి నిజాయితీలు కరువైన ఈ రోజుల్లో గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేశారని రైతుల కోసం సమాజ కోసం ఇంకా ఎంతో సేవ చేయాల్సి ఉన్న హనుమంతరావు మన మధ్యన లేకపోవడం బాధాకరం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం అన్నారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మాజీ సర్పంచులు పార సీతయ్య, ఎర్నేని బాబు,తొండపు సతీష్, నంబూరి సూర్యం, మల్లెల రాణి, డాక్టర్ సుబ్బారావు, రామారావు, ఓరుగంటి ప్రభాకర్, ముత్తినేని సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు కనకమ్మ, ఉన్నం శ్రీనివాసరావు, లత, శ్రీ లక్ష్మీ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు……….

Related posts

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

TNR NEWS

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS