Tnrnews.in
తెలంగాణ

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్ లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని గుడు గుండ్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరావు సంతాప సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి నిజాయితీలు కరువైన ఈ రోజుల్లో గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేశారని రైతుల కోసం సమాజ కోసం ఇంకా ఎంతో సేవ చేయాల్సి ఉన్న హనుమంతరావు మన మధ్యన లేకపోవడం బాధాకరం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం అన్నారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మాజీ సర్పంచులు పార సీతయ్య, ఎర్నేని బాబు,తొండపు సతీష్, నంబూరి సూర్యం, మల్లెల రాణి, డాక్టర్ సుబ్బారావు, రామారావు, ఓరుగంటి ప్రభాకర్, ముత్తినేని సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు కనకమ్మ, ఉన్నం శ్రీనివాసరావు, లత, శ్రీ లక్ష్మీ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు……….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్  ములకలపల్లి రాములు

TNR NEWS

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

సిపిఎం సీనియర్ నాయకులుమరిపెల్లి వెంకన్న ను పరామర్శిన   సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ

TNR NEWS

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS

నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

TNR NEWS