మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన గుండెపురి ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటాం అని స్ధానిక సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అన్నారు.ఇటివల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన గుండెపురి ఉపేందర్ దశదిన కర్మ సందర్భంగా 50 కేజీ బియ్యాన్ని సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అందజేశారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్యావుల సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మళోత్ లక్యా నాయక్,గట్టు ఉపేందర్ రావు,మునుకుంట్ల శీను,గట్టు వెంకటేశ్వర్లు,సోమపంగు గోపి,కొండమీది సురేష్,జిల్లేపల్లి శ్రీనివాస్,గుండెపురి యాదగిరి, కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
