Tnrnews.in
తెలంగాణ

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : రూరల్ ఏసీపీ

యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఏసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్ర మత్తం చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పప రిణామాలపై విద్యార్థులు, ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ సంజీవ్, ఎస్సై జగదీశ్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..!!

TNR NEWS

యువత క్రీడల్లో రాణించాలి

TNR NEWS

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

TNR NEWS

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఉదార్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు ● డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి

TNR NEWS