తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం మందకొడిగా సాగుతుండగా.. మరో ఐదు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో జోరుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నాయని తెలిపింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
