ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. పాఠశాలల ఆధునికీకరణ పై ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి క్లాస్ రూమ్లోనూ సరిపడా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని, విద్యార్థులు కూర్చునే బెంచీలు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ డి ఈ రమేష్ ఏఈ ఓబులేష్ తదితరులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
