Tnrnews.in
తెలంగాణ

పూరి గుడిసెల సర్వేలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామంలో మంగళవారం పూరి గుడిసెల ఇళ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) మమత పంచాయతీ కార్యదర్శి ఉదయ్ మరియు సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య ఉప సర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు సంయుక్తంగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా వారు గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించి, అర్హులైన నిరుపేదలు నివసిస్తున్న పూరి గుడిసెలను, వారి నివాస స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, తద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పంచాయతీ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఉప సర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సర్వే కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి విజయలక్ష్మి, మొగిలి చర్ల నాగరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళలు సామాజిక సమానత్వం సాధించాలి

TNR NEWS

పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక…. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో, ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి…… అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు….. వేపాలసింగారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

బీరప్ప స్వామి దేవాలయానికి ఆర్థిక సాయం అందజేసిన.  పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్

TNR NEWS

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

TNR NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

TNR NEWS

ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

TNR NEWS