Tnrnews.in
తెలంగాణ

పూరి గుడిసెల సర్వేలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామంలో మంగళవారం పూరి గుడిసెల ఇళ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) మమత పంచాయతీ కార్యదర్శి ఉదయ్ మరియు సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య ఉప సర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు సంయుక్తంగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా వారు గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించి, అర్హులైన నిరుపేదలు నివసిస్తున్న పూరి గుడిసెలను, వారి నివాస స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, తద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పంచాయతీ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఉప సర్పంచ్ మొగిలిచర్ల సీతారాములు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సర్వే కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి విజయలక్ష్మి, మొగిలి చర్ల నాగరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సైబర్ నేరాల పై అవగాహన

TNR NEWS

రైతులను రారాజుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి

TNR NEWS

బి.యన్.రెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండో దశ  ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరి కుప్పల వెంకన్న  జిల్లా కార్యదర్శి షేక్ నజీర్

TNR NEWS

పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలి

Harish Hs

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత పై సమీక్ష.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS