Tnrnews.in
తెలంగాణ

మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

నెక్కొండ ఈరోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు స్థానికత కోల్పోవుటకు కారణమైన, అశాస్త్రీయంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 విడుదలై నేటికీ మూడు సంవత్సరాలు అయినందున వరంగల్ జిల్లా నెక్కోండ మండల ఎంపిడిఓ కార్యాలయంలో బాధిత కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శి సంఘ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది .ఇందుకు మద్దతుగా ఎంపిడిఓ నెక్కొండ మండల కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఈనెల 8న చలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టే మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ను జీవో త్రీ వన్ సెవెన్ జేఏసీ పిలుపుమేరకు విడుదల చేయడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

TNR NEWS

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి  మాదక ద్రవ్యాలు / డ్రగ్స్,గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తప్పవు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే

Harish Hs