Tnrnews.in
తెలంగాణ

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

కోదాడ నూతన కోర్టు భవనం పూర్తయ్యేంతవరకు తాత్కాలికంగా రెండు సంవత్సరాలపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యకలాపాలు కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. కాగా ఈరోజు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ గోవర్ధన్ రెడ్డి సీనియర్ సివిల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జి భవ్యాలతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న భవనం ఇరుకుగా మారి వర్షం వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ భవనంలోకి మార్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు దేవ బత్తిని నాగార్జున, ఎలక సుధాకర్ రెడ్డి,సిలువేరు వెంకటేశ్వర్లు, శరత్ బాబు,ఈదుల కృష్ణయ్య, ఉయ్యాల నరసయ్య,సీతారామరాజు, బండి వీరభద్రం,అబ్దుల్ రహీం,కడారు వెంకటేశ్వర్లు,శ్రీధర్, హేమలత, నవీన్, హుస్సేన్,మంద వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాఘవేంద్ర పాఠశాలలో బోనాల సంబరాలు

TNR NEWS

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Harish Hs

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం

Harish Hs

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS