కామారెడ్డి జిల్లా మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఆయన మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ నడిచిన ఈ గడ్డపై అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన సిద్ధాంతమన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. శివసేన, జనసేన సనాతనాన్ని రక్షించేందుకు పుట్టాయని ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.కాగా ఆయనను చూసేందుకు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి నుంచి యువకులు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
