Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

కాకినాడ : భోగిగణపతి పీఠం నుండి 14 ఏళ్లుగా భద్రాచల పాదయాత్ర రథయాత్ర చేస్తున్న గొంచాల ఉత్సవ కమిటీ రూ.12లక్షల ప్రత్యేక నిధులు సేకరించి  జాతీయ రహదారిని ఆనుకుని వున్న గొంచాల గ్రామంలో రామాలయాన్ని నూతనంగా నిర్మించింది. మార్చి 3న పరివార దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన చేపట్టిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆహ్వాన శుభపత్రికను గణపతి పీఠంలో పంచదారతో తయారు చేసిన శ్రీకాళహస్తీశ్వరుని పటిక శివలింగం వద్ద మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజల్లో వుంచి ఆవిష్కరించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు  మాట్లాడుతూ స్వయంభూ భోగి గణపతి అనుగ్రహంతో 2012లో  చేపట్టిన పాదయాత్రలను కొనసాగిస్తూ భద్రాద్రి రామాలయాలు నిర్మించడం పట్ల శుభాశీస్సులు తెలిపారు. పాదయాత్ర ఆలయ నిర్మాణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పేర్నీడి వెంకటరమణ మాట్లాడుతూ పాదయాత్రికుల గురుస్వామి వాసుదేవ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రతిష్టాపనమహోత్సవం జరుగుతున్నదని తెలిపారు.

Related posts

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

Dr Suneelkumar Yandra

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

Dr Suneelkumar Yandra

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

Dr Suneelkumar Yandra

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

Dr Suneelkumar Yandra

పిఠాపురం వాసికి సివిల్స్లో 94వ ర్యాంకు

Dr Suneelkumar Yandra

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక దృష్టి ఉంటుంది