Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

కాకినాడ : భోగిగణపతి పీఠం నుండి 14 ఏళ్లుగా భద్రాచల పాదయాత్ర రథయాత్ర చేస్తున్న గొంచాల ఉత్సవ కమిటీ రూ.12లక్షల ప్రత్యేక నిధులు సేకరించి  జాతీయ రహదారిని ఆనుకుని వున్న గొంచాల గ్రామంలో రామాలయాన్ని నూతనంగా నిర్మించింది. మార్చి 3న పరివార దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన చేపట్టిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆహ్వాన శుభపత్రికను గణపతి పీఠంలో పంచదారతో తయారు చేసిన శ్రీకాళహస్తీశ్వరుని పటిక శివలింగం వద్ద మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజల్లో వుంచి ఆవిష్కరించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు  మాట్లాడుతూ స్వయంభూ భోగి గణపతి అనుగ్రహంతో 2012లో  చేపట్టిన పాదయాత్రలను కొనసాగిస్తూ భద్రాద్రి రామాలయాలు నిర్మించడం పట్ల శుభాశీస్సులు తెలిపారు. పాదయాత్ర ఆలయ నిర్మాణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పేర్నీడి వెంకటరమణ మాట్లాడుతూ పాదయాత్రికుల గురుస్వామి వాసుదేవ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రతిష్టాపనమహోత్సవం జరుగుతున్నదని తెలిపారు.

Related posts

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవి సుందర్ ని గెలిపించండి – మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎన్నికల ప్రచారం

Dr Suneelkumar Yandra

దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..

Dr Suneelkumar Yandra

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra