మండలం ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన నాగంటి మంగమ్మను ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం విధుల నుంచి తొలగించారన్న ఆరోపణలు.ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇవ్వలేదనే కారణంతోనే తనపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని మంగమ్మ ఆరోపించారు.గత 26 సంవత్సరాలుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ సేవలు అందిస్తున్నప్పటికీ ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.తమపై ఎలాంటి పిటిషన్, ఫిర్యాదు లేదా కేసు నమోదు కాకుండానే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వాహనంలో తీసుకెళ్లారని ఆరోపించారు.పోలీసు వాహనంలో ఎక్కించిన ఘటన గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, వాటిని పరిశీలిస్తే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని నాగంటి మంగమ్మ డిమాండ్
Save or share this story as a newspaper-style Epaper Clip:
