రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోని 65వ నెంబర్ జాతీయ రహదారి పై చోటుచేసుకుంది, స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మునగాల గ్రామానికి చెందిన నారగాని రాంబాబు42 వృత్తి కానిస్టేబుల్ గా కోదాడ నందు విధులు ముగించుకుని మునగాలకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ముకుందాపురం గ్రామం వద్దకు రాగానే జాతీయ రహదారిపై నిలిపి ఉన్న కారును వెనక నుండి వేగంగా ఢీకొట్టడంతో రాంబాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి, చికిత్స నిమిత్తం108 వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో రాంబాబు మృతి చెందాడు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
