హైదరాబాద్ : నిత్యం వెండితెర, బుల్లితెర విశేషాలను పాఠకులకు చేరవేస్తూ జర్నలిజంలో నూతన ఒరవడితో పనిచేస్తున్న ఫిల్మ్ జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు, పి.ఆర్.ఓలకు స్వాతిముత్యం సినిమా దినపత్రిక 4వ వార్షికోత్సవం సంధర్భంగా చిరు సత్కారాలు చేయడం జరుగుతుందని స్వాతిముత్యం సినిమా దినపత్రిక సంపాదకుడు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ తెలిపారు. తెలుగు ప్లెక్స్ సమర్పణలో తెలుగు వాడుకభాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో స్వాతిముత్యం సినిమా దినపత్రిక సంపాదకుడు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఆధ్వర్యంలో ఈ సత్కారకార్యక్రమం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఈ నెల ఏప్రియల్ 28వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభించడం జరుగుతుందన్నారు.
