Tnrnews.in
తెలంగాణ

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

కిడ్నీ మార్పిడిలో బాధితులను మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్నంలోని శ్రీరంగాపురం చెందిన నరేష్ తో విజయవాడకు చెందిన తాతారావు పృథ్వీరాజ్ మండపేట కు చెందిన గంగారావు రమాదేవి, వీరి తో పాటు మరో ఇద్దరిని ఆశ్రయించాడు.వారు 22 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని కిడ్నీ మార్పిడి చేశారు. ఫోర్జరీ స్టాంపులతో సంతకాలతో సర్టిఫికెట్ను సృష్టించి ఈ ముఠా లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్లు డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత హాస్పటల్ కి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో పోలీసులు నరేష్ నుంచి వివరాలు సేకరించారు దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడకు చెందిన ఈ ముఠాను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులు పట్టు పడగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు పదిమంది నుంచి కిడ్నీ మార్పిడి చేయించినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్.

TNR NEWS

స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక

TNR NEWS

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

TNR NEWS

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

TNR NEWS

కోదాడలో గ్యాస్ సిలిండర్ దొంగ అరెస్ట్

Harish Hs