Tnrnews.in
తెలంగాణ

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

కిడ్నీ మార్పిడిలో బాధితులను మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్నంలోని శ్రీరంగాపురం చెందిన నరేష్ తో విజయవాడకు చెందిన తాతారావు పృథ్వీరాజ్ మండపేట కు చెందిన గంగారావు రమాదేవి, వీరి తో పాటు మరో ఇద్దరిని ఆశ్రయించాడు.వారు 22 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని కిడ్నీ మార్పిడి చేశారు. ఫోర్జరీ స్టాంపులతో సంతకాలతో సర్టిఫికెట్ను సృష్టించి ఈ ముఠా లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్లు డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత హాస్పటల్ కి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో పోలీసులు నరేష్ నుంచి వివరాలు సేకరించారు దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడకు చెందిన ఈ ముఠాను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులు పట్టు పడగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు పదిమంది నుంచి కిడ్నీ మార్పిడి చేయించినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నీట్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయం లో ఘనంగా గనతంత్ర వేడుకలు

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

TNR NEWS

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS