Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో సన్న బియ్యం లబ్ధిదారుడు షేక్ యాకుబ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు కోదాడ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. రైతు భరోసా, బోనస్ పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకం అమలు చేసి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, పాలూరి సత్యనారాయణ,గుండెల సూర్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…………

Related posts

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS

మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS

వీరాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ 

TNR NEWS

బీసీ రిజర్వేషన్ల అమలు కు 5న సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

TNR NEWS