Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి.     -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్

సూర్యాపేట:భారత స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన మహనీయుల చిత్రపటాలతో కూడిన ఎగ్జిబిషన్ ను ఈనెల 5న దురాజ్ పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆవాస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. వేలాది మంది ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి, దేశభక్తిని చాటారని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు చేసిన గొప్ప త్యాగాలను విస్మరించి, ముస్లింల దేశభక్తిని ప్రశ్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ అవాస్తవ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు, స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆవాజ్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ (ఐపీఎస్) హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆవాస్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షాకీర్ హుసేని, మహమ్మద్ జానీ పాషా, మహమ్మద్ జమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS

తొర్రూర్ లో జాతీయ మధింపు పరీక్ష 

TNR NEWS

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS

విమాన ప్రమాద మృతులకు నివాళులు

TNR NEWS

ఘనంగా సిపిఐ పార్టీ ఆవిర్భావదినోత్సవం వేడుకలు  – త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర ఎర్రజెండాది – శివలింగ కృష్ణ గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి 

TNR NEWS