November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి.     -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్

సూర్యాపేట:భారత స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన మహనీయుల చిత్రపటాలతో కూడిన ఎగ్జిబిషన్ ను ఈనెల 5న దురాజ్ పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆవాస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. వేలాది మంది ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి, దేశభక్తిని చాటారని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు చేసిన గొప్ప త్యాగాలను విస్మరించి, ముస్లింల దేశభక్తిని ప్రశ్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ అవాస్తవ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు, స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆవాజ్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ (ఐపీఎస్) హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆవాస్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షాకీర్ హుసేని, మహమ్మద్ జానీ పాషా, మహమ్మద్ జమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి

TNR NEWS

_వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._*   *_కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._*   *_వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._*   *_తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి._ నాగయ్య* *డిమాండ్* 

TNR NEWS

మునగాల: గంజాయి సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్

Harish Hs

దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతే కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

TNR NEWS

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

Harish Hs

ద్విచక్ర వాహనం పట్టివేత

TNR NEWS