May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

నారాయణపేట జిల్లా మద్దూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్ఐ అమర్ నాథ్‌రెడ్డి మద్దూరు మండలంలోని రేణి వట్ల గ్రామానికి చెందిన ఒక రైతుకు సంబంధించి ఐదు గుంటల పొలాన్ని పాస్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు 5000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు ఎంత వేడుకున్న ఆర్ఐ వినకుండా డబ్బులు ఇస్తే గాని పని జరగదు అని తేల్చి చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం పక్కా ప్రణాళికలతో మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి సిబ్బంది కలిసి లంచం డబ్బులను పట్టుకొని ఆర్ఐ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కార్యాలయములో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Related posts

సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలి

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

Harish Hs

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

Harish Hs

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS