Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జునరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలో హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనవరి 26న రైతులందరికీ రైతు భరోసా బ్యాంకులో జమ చేస్తానని చెప్పి నేటికీ జమ చేయకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న 12 వేల రూపాయలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఇస్తామన్న 25 వందల రూపాయలు, ప్రభుత్వం పెంచుతామన్న పింఛన్లు వెంటనే పెంచాలన్నారు. వచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరిని సమీకరించి ప్రజా పరాటాలను నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ మహాసభలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నె మ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్రావు నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు ,కోట గోపి ,చెరుకు ఏకలక్ష్మి ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

చీమలపేటలో ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథి పాల్గొన్న..పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్…

TNR NEWS

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’

TNR NEWS

ఉట్కూరు నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి 

TNR NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

TNR NEWS

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

TNR NEWS