Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ

మండల పరిధిలోని ఊరెళ్ళ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కొందరు విద్యార్థులు వివిధ శాఖల అధికారులుగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రిగా ఆయేషా సిద్దిక, కలెక్టర్ గా మహమ్మద్ సిరాజ్ హుస్సేన్, జిల్లా విద్యాశాఖ అధికారిగా మహమ్మద్ సమీర్, ఉప విద్యాధికారిగా ఆయేషా ఫాతిమా, మండల పరిషత్ అధికారిగా సోఫియా, మండల విద్యాధికారిగా అర్బాన్, ప్రధానోపాధ్యాయులుగా చరణ్ తేజ వ్యవహరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మహమ్మద్ జహంగీర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపిన జిల్లా పోలీసు

TNR NEWS

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

TNR NEWS

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం 

TNR NEWS

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs

నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ 

TNR NEWS