Tnrnews.in
తెలంగాణ

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ

మండల పరిధిలోని ఊరెళ్ళ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కొందరు విద్యార్థులు వివిధ శాఖల అధికారులుగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రిగా ఆయేషా సిద్దిక, కలెక్టర్ గా మహమ్మద్ సిరాజ్ హుస్సేన్, జిల్లా విద్యాశాఖ అధికారిగా మహమ్మద్ సమీర్, ఉప విద్యాధికారిగా ఆయేషా ఫాతిమా, మండల పరిషత్ అధికారిగా సోఫియా, మండల విద్యాధికారిగా అర్బాన్, ప్రధానోపాధ్యాయులుగా చరణ్ తేజ వ్యవహరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మహమ్మద్ జహంగీర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs