May 15, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

: డిసెంబర్ 1 న హైదరాబాద్‎లో జరగనున్న మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్, రాయపోల్ మండల నాయకులు దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం ఆరెపల్లి, దౌల్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఇకనైనా మాలలు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటికి రావాలని పిలుపునిచ్చారు.అన్నీ కులాల వారు సమావేశాలు నిర్వహించుకుంటారని అలాంటప్పుడు మాలలు సమావేశం జరుపుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మేము వేరే కులాల గురించి మాట్లాడట్లేమని మా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు దోచుకుంటున్నారని,ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్ట్‎లు వారికే వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పు మాలలకే కాదు మాదిగలు, ఎస్టీలకు కూడా వ్యరేతికంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కుల వివక్ష లేదనే భావన కలిగించేలా ఉందని పేర్కొన్నారు. కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటు ఒక్కటి కాదని రాజ్యాంగంలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదని,రాజ్యాంగాన్ని కాపాడాలనే మా పోరాటమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కుల వివక్ష లేదని ఏ ఒక్కరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీల్లో కుట్రలు ఉన్నాయి.అలాంటి కుట్రలు మాలల్లో ఉండొద్దు అనేది మా లక్ష్యమన్నారు.జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడ లేదని, దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. మా మాల జాతి ఐక్యత కోసమే 2024, డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు సంఘం నాయకులు ఇంద్రాల పరశురాం, లక్ష్మణ్, నరేష్, సత్యం, చక్రి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దాడి చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా..! జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.. తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డిమాండ్… ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS

ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎర్నేని

Harish Hs

ఘనంగా డా ఉమర్ ఆలీషా జన్మదిన వేడుకలు

Dr Suneelkumar Yandra

ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్‌కు ‘కల్చరల్ పార్టనర్ అవార్డ్’ – ప్రచారం మీడియా ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు–2025’

TNR NEWS

మండల రైతాంగానికి పోలీసువారి విజ్ఞప్తి ధాన్యం సేకరణ ,ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల జాగ్రత్త వహించాలి . మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs