Tnrnews.in
తెలంగాణరాజకీయం

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

: డిసెంబర్ 1 న హైదరాబాద్‎లో జరగనున్న మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్, రాయపోల్ మండల నాయకులు దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం ఆరెపల్లి, దౌల్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఇకనైనా మాలలు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటికి రావాలని పిలుపునిచ్చారు.అన్నీ కులాల వారు సమావేశాలు నిర్వహించుకుంటారని అలాంటప్పుడు మాలలు సమావేశం జరుపుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మేము వేరే కులాల గురించి మాట్లాడట్లేమని మా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు దోచుకుంటున్నారని,ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్ట్‎లు వారికే వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పు మాలలకే కాదు మాదిగలు, ఎస్టీలకు కూడా వ్యరేతికంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కుల వివక్ష లేదనే భావన కలిగించేలా ఉందని పేర్కొన్నారు. కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటు ఒక్కటి కాదని రాజ్యాంగంలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదని,రాజ్యాంగాన్ని కాపాడాలనే మా పోరాటమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కుల వివక్ష లేదని ఏ ఒక్కరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీల్లో కుట్రలు ఉన్నాయి.అలాంటి కుట్రలు మాలల్లో ఉండొద్దు అనేది మా లక్ష్యమన్నారు.జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడ లేదని, దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. మా మాల జాతి ఐక్యత కోసమే 2024, డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు సంఘం నాయకులు ఇంద్రాల పరశురాం, లక్ష్మణ్, నరేష్, సత్యం, చక్రి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజలందరి దేవుడు అంబేద్కర్

TNR NEWS

ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’

TNR NEWS

రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

TNR NEWS

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS