భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భవదినోత్సవ సందర్భంగా గజ్వేల్ ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపాహడు లో గ్రామ కార్యదర్శి కొండకిండి పోచయ్య గజ్వేల్ నియోజకవర్గంసిపిఐ పార్టీ కార్యదర్శిశివలింగ కృష్ణ ఆధ్వర్యంలో జెండాన్ ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శివలింగ కృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ల 1925 డిసెంబర్ 26వ తారీఖున నిర్మించి నేటికీ 100 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ అనేకమైన పోరాటాలు చేసి తెలంగాణ రైతాంగసాయుధ పోరాటంలో 4000 మంది అమరులై 10 లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన ఘనత కేవలం భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఆయన అన్నారు ఎప్పటికైనా పేద ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది కేవలం సిపిఐ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండి రాజా, రుద్రారం బిక్షపతి, నరసయ్య, కనకయ్య, బిక్షపతి, మల్లయ్య, యాదమ్మ, సాయిలు, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
