Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకై చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి * ములుగుమండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం 

హమాలి కార్మికుల కొరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు హమాలి కార్మికులందరూ పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ములుగు మండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం పిలుపునిచ్చారు. ఒంటిమామిడి మార్కెట్ హమాలి కార్మికులతో కలిసి హమాలి వెల్ఫేర్ బోర్డు సాధనకై సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయడం కోసం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు పని ప్రదేశాల్లో అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగి కాళ్లు, చేతులు విరిగి పోవడం, ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఉంటున్నాయని, ఇలాంటి కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హమాలి కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటి, పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ గోదాముల లోని హమాలి కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, పని ప్రదేశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, కార్మికులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

సూర్యాపేట జిల్లా ఎస్పీ గా కె. నరసింహ

Harish Hs

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి

TNR NEWS

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS