Tnrnews.in
తెలంగాణ

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

కోదాడ లోని తేజ ఫార్మసీ కళాశాల లో విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ సీఐ టి.రాము హాజరై మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని,విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ తో చదివి ఆ లక్ష్యాలను సాధించాలని అన్నారు.ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ కనుగొనటంలో ఫార్మా రంగం కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు.కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జన్మ నిచ్చిన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని,విద్య నేర్పిన గురువులను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీ e వో యస్ యస్ రావు,శ్రీ సాయి వికాస్ డిగ్రీ,యం యస్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పి.గంగాధర్ రావు ,యం.ప్రసాద్ ,అధ్యాపకు రాళ్ళు కవిత,సల్మా,సాహితీ,వీర కుమారి,అంజుమ్, నిఖత్,అమ్రీన్,రమాదేవి,అరుణ, సిబ్బంది ప్రవీణ,జి.నాగేశ్వర రావు,బి. నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు చైర్మన్, పందిరి నాగిరెడ్డి,సీ ఈ ఓ యస్ యస్ రావు లు బహుమతులు అందజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ విజయోత్సవాలు  బస్టాండ్ లోపల సిసి కెమెరాలు లేని వైనం  విజయోత్సవాలు కాదు అభివృద్ధి కావాలి  విజయోత్సవాలు ఫ్లెక్సీల పై కాదు 

TNR NEWS

చేర్యాల ప్రాంత రైతాంగానికి కాంగ్రెస్ ముసుగులో ఉన్న జేఏసీ నాయకులు క్షమాపణ చెప్పాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి

TNR NEWS

జయ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

Harish Hs

ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలి

Harish Hs

ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్‌ రైలు

TNR NEWS