Tnrnews.in
తెలంగాణ

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే మునగాల మండల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని గురువారం మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.పండుగకు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో పలు కాలనీలు, బస్తీల్లోని ఇళ్లకు తాళాలు వేస్తారని, దీనిని అసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.ఊరికి వెళ్లే ముందు ఇంట్లోని డబ్బు, బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్‌‌ లో భద్రపరుచు కోవాలని, ఇంటికి తాళం వేసిన తరువాత తాళం కనిపించకుండా డోర్‌ కర్టెన్‌లను వేయాలని, గేటుకు తాళం లోపలివైపు నుండి వేసి జాగ్రత్త వహించాలని చెప్పారు.ఇంట్లో పగలు, రాత్రి చిన్న విద్యుత్ బల్బు వెలిగే లా ఏర్పాటు చేయాలని సూచించారు.మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

*దూసుకొస్తున్న తుఫాను.. తెలంగాణాలోనూ ఈ జిల్లాలలో భారీవర్షాలు..!!*

TNR NEWS

సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TNR NEWS

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS