పెద్దపల్లి జిల్లా రైల్వే, ఇతర రైల్వే ప్యాసింజర్లు, ప్రజల విన్నపం అభ్యర్థన ఏమనగా పెద్దపల్లి రైల్వే జంక్షన్ లో ఇదివరకు ఆగుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలుపుదల రద్దు క్యాన్సల్ చేసినారు,కావున తిరిగి మళ్లీ పెద్దపల్లి రైల్వే జంక్షన్ లో నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆగుటకు అనుమతించగలరు.అని పెద్దపల్లి జిల్లా ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ నుండి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి, వేములవాడ, కాలేశ్వరం, కోటిలింగాలు ,ధర్మపురి, మంథని ,రామగుండం, యాదగిరిగుట్ట ,ఓదెల దేవస్థానం మొదలగు పుణ్యక్షేత్రాల నుండి కూడా నవజీవన్ ఎక్స్ప్రెస్ భక్తులు రాకపోకలు జరుగుతున్నాయి, అధిక ప్రజలు వ్యాపారవేత్తలు, రాజస్థాన్, మార్వాడీలు,ఉద్యోగస్తులు విద్యార్థులు చాలా మంది నవజీవన్ ఎక్స్ప్రెస్ లో చైనా నుండి అహ్మదాబాద్ నుండి చెన్నై వెళ్తూ ఉంటారు.వస్తూ ఉంటారు కావున పైన తెలిపిన విషయాలు పరిశీలించి నవజీవన్ ఎక్స్ ప్రెస్ కు తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ లో ఆగుటకు ఆదేశించగలరు అని ప్రజలు కోరుకుంటున్నారు.పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ లో కొత్త రైలు నిలుపుదల గురించి ఈ క్రింది విధంగా రైల్వే పేర్లు తెలంగాణ ఎక్స్ ప్రెస్ ,దక్షిణ ఎక్స్ ప్రెస్ ,సికింద్రాబాద్ నాగపూర్ ఎక్స్ ప్రెస్ ,మైసూర్ జైపూర్ ఎక్స్ ప్రెస్ ,వందే భారత్ ఎక్స్ ప్రెస్ పైన తెలిపిన 5 ట్రైన్లను ప్రజల నుండి చాలా ఒత్తిడి వస్తుంది పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ లో ఆల్టింగ్ ఇచ్చినచో పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు చాలా ఆదాయం పెరుగుతుంది. ప్రజలు కూడా చాలా సౌకర్యాలు కలుగుతాయి కావున ఈ ట్రైన్ రకు మీరు పెద్దపల్లి లో ఆగుటకు ఉత్తర్వులు ఇవ్వగలరని ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ నూతన హంగులతో సృవీకరణ,చాలా రకాల అభివృద్ధి పనులు సీనియర్ సిటిజెన్లకు లిఫ్ట్ ఏర్పాటు పనులు ఇక్సులేటర్ పనులు తాగునీటి సమస్యలు విశ్రాంతి గది సమస్యలు ప్రయాణికులు కూర్చుంటకు సీటు ఏర్పాటు వికలాంగులకు వీల్ చైర్ ఏర్పాట్లు మహిళలకు విశ్రాంతి గదులు ప్రయాణికులకు విశ్రాంతి గదులు రైల్వే ప్రయాణికు అన్ని సౌకర్య కల్పించగలరు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
