Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ్మరకు చెందిన పలువురు రైతులు రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని నేటికీ రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని సతీష్, కనగాల పూర్ణచందర్ రావు, మాతంగి ప్రసాద్, మందారపు వెంకటేశ్వర్లు, సైదులు, వెన్నబోయిన శ్రీను, దంతాల గోపి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……

Related posts

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు* * రౌడీ మేళాలో హెచ్చరించిన డిఎస్పీ రాములు

TNR NEWS

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

Harish Hs

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS

నిరుపేదల అపన్న హస్తం సీఎం సహాయనిది

TNR NEWS

స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం

Harish Hs