Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

కాకినాడ : మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ వాసం శెట్టి ప్రసన్న కుమార్ (35)కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26 కేజీల బియ్యం, రెండు వేల అయిదువందల నగదు అందజేసి సహకరించింది. సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు చేతుల మీదుగా అందించారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ) ద్వారా సిఎం సహాయనిధికి ప్రోఫార్మా దాఖలు చేసిన దృష్ట్యా ఇప్పటికే 8లక్షల రూపాయల వైద్యాన్ని ప్రయివేటుగా చెల్లించి పొందారని మరో రెండు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి వున్నందున సిఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం రూ.10లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వెతలు తీరతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్ళే అవకాశం లేనందున వచ్చే వారం గ్రీవెన్స్ కి వెళ్లాలని సూచించారు. జిల్లా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్న దృష్ట్యా ఇతని కుటుంబ కష్టాలు తెలుసుకుని సిఎం సహాయ నిధి త్వరగా అందించే సహాయం చేయాలన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ఇతని కుటుంబానికి పోషణ సహాయం అందించాలని కోరారు. ఎటువంటి పని చేసే శక్తి లేక భార్య ఆసరాతో ఇద్దరు అమ్మాయిలతో ఆవేదన చెందుతున్న అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు, కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు.

Related posts

అక్రిడేషస్లు ఎర!

Dr Suneelkumar Yandra

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు పేరు ఖరారు

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

TNR NEWS

మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్ పవన్ తో మర్యాదపూర్వక భేటీ

TNR NEWS

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి