May 8, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

మహాత్మా గాంధీ ఆలోచన , పరిశుభ్ర గ్రామీణ పట్టణ భారతదేశం . మహాత్ముని ఆశయ సాధన కోసం 2014  అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు . పట్టణ ప్రాంతాలలో పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ లో ప్రారంభించారు . ఈ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులంతా పలు పట్టణాలలో పాల్గొన్నారు. అనిల్ అంబానీ , సచిన్ టెండూల్కర్ , బాబా రాందేవ్ , కమలహాసన్ మొదలగు అనేక దిగ్గజాలు కార్యక్రమంలో పాల్గొన్నారు . స్వచ్ఛభారత్ దేశంలో 4041 పైగా పట్టణాల్లో అమలు చేశారు . మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలు . దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 14,623 కోట్ల రూపాయలు.ఈ కార్యక్రమాన్ని విశాఖలో నాటి పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు  బిజెపి  వైద్య విభాగం ఆధ్వర్యంలో , ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్  లో ప్రారంభించి , ఐదు సంవత్సరాలలో నగరంలో అనేక స్వచ్ఛభారత కార్యక్రమాలలో పాల్గొని విశాఖ ప్రజలకు , అధికారులకు స్ఫూర్తిని ఇచ్చారు.
విశాఖకు స్వచ్ఛభారత్ స్వచ్ఛతాహి సేవలో 3,6,9 స్థానములు లభించాయి. స్మార్ట్ సిటీగా రూపు దిద్దుతున్న విశాఖలో స్వచ్ఛభారత్ ద్వారా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువైంది . మన ఇల్లు , మన సమాజం పరిశుభ్రత లక్ష్యముగా స్వచ్ఛభారత్  కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం .

Related posts

మహిళా సాధికారిత దిశగా అడుగులు

TNR NEWS

వసుంధర తేజం గోవిందనామం – శ్రీవారిభక్తులతో గణపతిపీఠం లో73వ జపయజ్ఞ పారాయణ

Dr Suneelkumar Yandra

ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్

ఈ నెల 31న కాంట్రాక్టు లెక్చరర్స్ రాష్ట్ర కౌన్సిల్ అత్యవసర సమావేశం

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

Dr Suneelkumar Yandra