Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగస్టు 15 – పీఠాధిపతి డా ఉమర్ అలీషా

పిఠాపురం : కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగష్టు 15 అని అన్నారు. ఎటువంటి భ్రాంతికిలోను కాకుండా విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవులను అలంకరించి, మీ కుటుంబానికి, మీ టీచర్ లకు, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకునిరావాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అన్నారు. జన్మనిచ్చిన తల్లి తండ్రులు, విద్య నేర్పు గురువులను ప్రత్యక్ష దైవంగా భావించాలని అన్నారు డా ఉమర్ ఆలీషా. పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. హై స్కూల్, ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. జూనియర్ కళాశాల ఆవరణలో పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, స్కూల్ హెడ్ మాస్టర్ రామ కృష్జ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కేశవరావు, టి.డి.పి. కౌన్సిలర్స్ రాయుడు శ్రీనుబాబు, అల్లవరపు నగేశ్, తదితరులు పాల్గొన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా జూనియర్ కళాశాల విద్యార్థులు 8 మందికి రూ.15 వేలు నగదు పారితోషికంగా అందజేశారు. స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో సుమారు 200 మొక్కలు పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని డా ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాల ఆవరణలో పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్స్, అధ్యాపకులు, సిబ్బంది, పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా గారి సోదరులు మెహబూబ్ పాషా, అహమద్ ఆలీషా, కబీర్ షా కూడా పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు*

TNR NEWS

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర అగ్నిప్రమాదం

TNR NEWS

ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్

చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు

Journalist Ratnam

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

TNR NEWS