Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

నారాయణపేట జిల్లా మద్దూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్ఐ అమర్ నాథ్‌రెడ్డి మద్దూరు మండలంలోని రేణి వట్ల గ్రామానికి చెందిన ఒక రైతుకు సంబంధించి ఐదు గుంటల పొలాన్ని పాస్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు 5000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు ఎంత వేడుకున్న ఆర్ఐ వినకుండా డబ్బులు ఇస్తే గాని పని జరగదు అని తేల్చి చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం పక్కా ప్రణాళికలతో మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి సిబ్బంది కలిసి లంచం డబ్బులను పట్టుకొని ఆర్ఐ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కార్యాలయములో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Related posts

సిపిఎం మహాసభలకు విరాళల సేకరణ

TNR NEWS

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

న్యాయ వాదులకు రక్షణ కల్పించాలి

TNR NEWS

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS

బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు

TNR NEWS