మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం నాడు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పర్యవేక్షించినారు ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా* జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి* వారు దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహించబోతున్న* ప్రాథమిక అభ్యాసన అధ్యయనం పరీక్ష *భాషా, గణిత, సామర్థ్యాల అమలుతీరును వివిధ బోధనోపకరణ ద్వారా బోధన చేస్తున్న తీరును విద్యార్థులు ఆశించిన స్థాయిలో ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేసినారు F. L. N. కార్యక్రమంలో లో భాగంగా తెలుగు భాష బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా చదవటము, రాయటంతో పాటు విద్యార్థులకు పద్యాలు, తాత్పర్యాలు, వ్యాకరణాంశాలు కూడా అవగాహన కలిగి ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు పాల్గొన్నారు.
